అమానుషం.. మైనర్‌ బాలికపై 6 నెలలుగా అన్నదమ్ముల అత్యాచారం

-

వరంగల్ లో అమానుష ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నదమ్ములిద్దరూ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న బాలిక(15)ను ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మద్‌ అలీ(26), అబూ(22) బాలికను ప్రలోభపెట్టి గత 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన వరంగల్‌ ఏసీపీ గిరికుమార్‌, మిల్స్‌ కాలనీ సీఐ శ్రీనివాస్‌ బాధిత కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు నిందితుల ఇళ్ల పై దాడి చేశారు. వారి ఇంటి ఎదుట ఉన్న ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు.  వరంగల్‌-నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news