రెయిన్‌ ఎఫెక్ట్‌: బీఆర్ఎస్ పార్టీ రైతు నిరసనలు వారం వాయిదా

-

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ రైతు నిరసనలు వారం పాటు వాయిదా వేస్తున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వారం పాటు వాయిదా వేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Telangana minister KTR leaves for US to attract investments

వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ మూడు గంటల ఉచిత విద్యుత్ విధానాన్ని ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news