BREAKING : BRS పార్టీలో విషాదం.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న కన్నుమూత

-

కెసిఆర్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జి. సాయన్న మృతి చెందారు. 72 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే సాయన్న మృతి చెందినట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాయన్న… యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే కన్నుమూశారు. మొత్తంగా ఐదు సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న…. టిఆర్ఎస్ పార్టీ నుంచి రెండుసార్లు గెలుపొందారు. ఇక అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న సాయన్న… ఆ పార్టీ తరపున మూడుసార్లు గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news