కేకే, కడియం నిర్ణయాలపై మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు

-

ఊహించినట్టే బీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో మార్చి 30న చేరనున్నారు. అలాగే తాను వరంగల్ బరి నుంచి తప్పుకొంటున్నట్లు కడియం కావ్య కేసీఆర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనను మన్నించాలంటూ ఆమె అందులో కోరారు. ఇక తన కూతురు భవిష్యత్తు కొరకై కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు.ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కే కేశవరావులు బీఆర్ఎస్ ని వీడటంపై ఆపార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

సోదరులుగా భావించి వీరికి పార్టీలో, ప్రభుత్వంలో కేసిఆర్ సముచిత స్థానాన్ని ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. కేకేను రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా, శ్రీహరిని డిప్యూటీ ముఖ్యమంత్రిని చేశారని, కేసిఆర్ కష్టాల్లో ఉంటే ఆయనను వీడటం సరికాదంటున్నారు. ముగ్గురి ఫొటోను షేర్ చేస్తూ.. వారి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news