వివేకా కేసులో ఆధారాలు చెరిపేసింది అవినాష్ రెడ్డినే – బీ.టెక్ రవి

-

వివేకా కేసులో ఆధారాలు చెరిపేసింది అవినాష్ రెడ్డినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బీ.టెక్ రవి. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు అన్నారు. గూగుల్ టేకవుట్ కాదు, టీడీపీ టేకవుట్ అనటం సరికాదని… దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్ధపై ఆరోపణలు చేయటం వైసీపీకే చెల్లిందని తెలిపారు.

వివేకా శరీరంపై గొడ్డలి పోట్లు, రక్తపు మరకలు కన్పిస్తున్నా గుండెపోటని నమ్మేంత అమాయకులా మీరు? హత్యతో తనకు సంబందం లేదంటున్న అవినాష్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వివేకా హత్య ముందు రోజు సునీల్ యాదవ్ మీ తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉండటం వాస్తవం కాదా? నువ్వు మీ ఇంటి నుంచి ఎర్రగంగిరెడ్డికి కాల్ చేయలేదా ? అని నిలదీశారు. గొడ్డలి కొనడానికి కదిరి వెళ్లిన దస్తగిరికి మీ ఇంటి నుంచి సునీల్ యాదవ్ మెసేజ్ చేసింది వాస్తవం కాదా? ఆ గొడ్డలికి డబ్బులు మీ ఇంటి లొకేషన్ నుంచే సెండ్ చేయటం నిజం కాదా? అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ బీ.టెక్ రవి.

Read more RELATED
Recommended to you

Latest news