శ్రీలంక ప్రధానికి పట్టిన గతి సీఎం జగన్‌ కు పడుతుంది – బుద్దా వెంకన్న

-

శ్రీలంక ప్రధానికి పట్టిన గతి సీఎం జగన్‌ కు పడుతుందని హెచ్చరించారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. టీడీపీ మహానాడుకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్న చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తాత దిగొచ్చినా.. మహానాడును ఆపలేరని తేల్చి చెప్పారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఎక్కడైతే అడ్డుకుంటున్నారో అక్కడే పెట్టి తీరతామని స్పష్టం చేశారు.

budda venkanna
budda venkanna

జగన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని.. కలెక్టరుకు చెప్పి మహానాడుకు అనుమతులివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు బుద్దా వెంకన్న. శ్రీలంక ప్రధానికి పట్టిన గతి సీఎంకు పడుతుందని.. ఐఏఎస్ అధికారులు సీఎంకు భయపడుతున్నారని విమర్శలు చేశారు. మహానాడుకు అనుమతి ఇవ్వకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు బుద్దా వెంకన్న. మేము చేతులు ముడుచుకుని కూర్చోలేదని.. ఎల్లుండిలోగా అనుమతి ఇవ్వకుంటే ఆందోళనలు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news