సీఎం జ‌గ‌న్‌కు చెవి మిషన్, కళ్లజోడును పంపిన టీడీపీ ఎమ్మెల్సీ.. ఎందుకో తెలుసా..?

-

అమ‌రావ‌తి రైతుల ఆందోళనలపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే జగన్ కు చెవి మిషన్, కళ్లజోడును కానుకగా పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నేనున్నాను… నేను విన్నాను’ అని జగన్ అన్నారని… 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అని మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న ప్రేమ సొంత రాష్ట్ర ప్రజలపై లేదా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అమరావతి రైతుల గుండెకోత మీకు వినపడటం లేదా? అని మండిపడ్డారు. అన్ని వసతులు ఉన్న అమరావతిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల అంతు చూస్తామన్న మంత్రులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news