పోలవరం మీద నిర్మలమ్మ హామీ ఇచ్చారు : బుగ్గన

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ భేటీ పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలు వివరించానని, పోలవరం  సవరించిన అంచనాలకు ఆమోదం పై పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారని అన్నారు. ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఖర్చు చేసిన 4 వేల కోట్ల రూపాయలలో, గత వారం ఏలాంటి షరతులు లేకుండానే 2,300 కోట్ల రూపాయలకు ఇటీవల కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని ఆయన అన్నారు.

2013-14 అంచనాలకు టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ నాటి అంచనాల కంటే భూసేకరణకే 17 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందమో అమ్మరి. 2013-14 ఆర్ధిక సంవత్సరం అంచనాల ప్రకారం  అయితే ఇబ్బంది అవుతుందని కేంద్ర మంత్రికి చెప్పామని సవరించిన అంచనా కమిటీ నివేదికలను కేంద్రానికి ఇచ్చామన్న ఆయన వాటిని సమీక్షించి నిధులు మంజూరు చేయాలని కోరామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news