వాహన కొనుగోలుదారులకు బంపరాఫర్..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ఇంటి నుండి బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు. ఎలాంటి క్లిష్ట సమయంలో చాల మంది సొంత వాహనం కొనుగోలు చేయాలని ఆలోచనలో పడ్డారు. అయితే మహీంద్రా వెహికల్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఇది మీకు తీపి కబురు అనే చెప్పాలి.

vechile
vechile

పండుగ సీజన్ వస్తోంది అంటే చాల ఆఫర్స్ అందుబాటులోకి వస్తాయి. అయితే కొత్తగా ఇంటికి ఏదైనా వెహికల్ కొనుగలు చేయాలని ప్లాన్ వేస్తున్నారా. మీరు బొలెరో పికప్ వెహికల్ కొనుగోలు చేస్తే మాత్రం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా అదిరిపోయే పండుగ ఆఫర్ తీసుకువచ్చింది.

ఇక మహీంద్రా కంపెనీ బొలెరో పికప్ వెహికల్ కొనుగోలు చేసే వారికి రూ.లక్ష వరకు కరోనా వైరస్ ఇన్సూరెన్స్ కవరేజీని ఉచితంగా అందిస్తోంది. వెహికల్ ఓనర్, కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుందని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఇక మహీంద్రా నుంచి పండుగకు ఇది మెగా ఆఫర్ అని చెప్పుకోవచ్చునన్నారు. అయితే అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు బొలెరో పికప్ వెహికల్ కొనుగోలు చేసిన వారు ఉచిత ఇన్సూరెన్స్ ఆఫర్ పొందొచ్చునన్నారు.

అంతేకాదు పికప్ మ్యాక్సి ట్రక్, సిటీ పికప్, చాంపర్ వంటి పలు మోడళ్లకు ఉచిత ఇన్సూరెన్స్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఇక ఉచిత కరోనా ఇన్సూరెన్స్ అనేది ఫ్లోటరన్ హెల్త్ ఇన్సూరెన్స్. వాహన కొనుగోలుదారుడు, భాగస్వామి, ఇద్దరు పిల్లలకు ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుందన్నారు. వాహనం కొనుగోలు చేసిన దగ్గరి నుంచి 9.5 నెలల వరకు పాలసీ అమలులో ఉంటుందని తెలిపారు.

అయితే మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఇన్సూరెన్స్ సేవల కోసం ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టిందని తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల హాస్పిటల్‌లో చేరినప్పుడు లేదంటే హోమ్ క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. కరోనా వైరస్ పాజిటివ్ వస్తే పాలసీ వర్తిస్తుందన్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు, భార్య, పిల్లలకు పాలసీ కవరేజీ ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news