దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ షురూ..!

-

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం షురూ అయింది. మొత్తం దేశంలోని 29 శాసనసభ… మూడు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఈరోజు ఉదయం పోలింగ్ మొదలయిన వాటిలో… రెండు లోక్ సభ స్థానాలు.. దాద్రా నగర్ హవేలీ, మండి ఖాంద్వా లు ఉండగా…

రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాలు అస్సాం 5, మధ్యప్రదేశ్ 3, హిమాచల్ ప్రదేశ్ 3, మేఘాలయ మూడు, కర్ణాటక 3, బెంగాల్ 4, రాజస్థాన్ 2, హర్యానా 1, మహారాష్ట్ర 1, మిజోరం 1 అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ మరియు తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ ప్రారంభం అవడంతో ఆయా నియోజకవర్గాలు లోక్ సభ స్థానాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news