కేంద్రం సరికొత్త నిర్ణయం.. దేశంలోని 81 కోట్ల మంది కోసం..!

-

దేశంలోని 81 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా ప్రతినెలా ఒక్కొక్కరికి 5కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమ పిండి, ఒక్కో కుటుంబానికి 1కేజీ పప్పును ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా కొనసాగుతోన్న ఈ పథకాన్ని నవంబర్ వరకు పొడగిస్తున్నట్లు.. జూన్ 30న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ ప్రకటనకు నేటి కేబినెట్ భేటీలో ఆమోదం పడిందని మంత్రి జవదేకర్ తెలిపారు. ఇతర రంగాలకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయాలను తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news