కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు.. ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుండి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ప్రియాంక గాంధీ, లేదా సోనియాగాంధీతో వెంకటరెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశం కాగా.. ఈ భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయన హాజరు కాలేదు.

అయితే తాజాగా ఢిల్లీకి రావాలని వెంకటరెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ నుండి ఫోన్ వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు రెండు రోజుల క్రితం ఢిల్లీలో మాకాం వేశారు. అయితే మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. వెంకట్ రెడ్డితో.. రేవంత్ రెడ్డికి ఉన్న విభేదాలు, మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి హై కమాండ్ చర్చించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news