మహేశ్ ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ సీక్వెల్స్‌పై క్లారిటీనిచ్చిన పూరీ జగన్నాథ్..

-

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్’ పాన్ ఇండియా వైడ్ గా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా, ఈ ప్రమోషన్స్ లో పూరీ జగన్నాథ్ ..మహేశ్ బాబు ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ సినిమాల సీక్వెల్స్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘జన గణ మన’ను పూరీ జగన్నాథ్ మహేశ్ తో చేయాలనుకున్నారు. కానీ, ఆ ప్రాజెక్టును విజయ్ దేవరకొండతో చేస్తు్న్న పూరీ..మహేశ్ తో చేయబోయే సినిమాల గురించి స్పష్టతనిచ్చారు. తనకు ‘పండుగాడు’, ‘సూర్య భాయ్’ క్యారెక్టరైజేషన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ‘బిజినెస్ మ్యాన్’ మూవీని హిందీలో రీమేక్ చేయాలని తనకు థాట్ ఉందని పేర్కొన్న పూరీ జగన్నాథ్..‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ సినిమాలకు సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

గతంలో ఈ సీక్వెల్స్ పైన తాను మహేశ్ బాబు చర్చించుకున్నామని, కానీ, తమకున్న కమిట్ మెంట్స్ వలన కుదరలేదని చెప్పుకొచ్చారు. ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ సీక్వెల్స్ ను డెఫినెట్ గా త్వరలో ప్లాన్ చేస్తానని, అది కూడా తెలుగులోనే మహేశ్ బాబుతోనేనని స్పష్టతనిచ్చారు పూరీ.

దాంతో మహేశ్ అభిమానులు సంతోషపడుతున్నారు. ‘జన గణ మన’ మహేశ్ తో చేయకపోయినప్పటికీ ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ సీక్వెల్స్ ను పూరీ జగన్నా్థ్.. చేస్తున్నారని సంతోషపడిపోతున్నారు.

ఇక ‘లైగర్’ విషయానికొస్తే..ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా బాలీవుడ్ భామ అనన్యా పాండే పరిచయం కానుంది. రమ్యకృష్ణ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news