సన్ రైజర్స్ అతడి కోసం ఎన్ని కోట్లయినా పెడుతుందా?

-

ఐపీఎల్ వేలం వచ్చే వారంలో దుబాయ్ వేదికగా జరగనుంది. అందులో భాగంగా అన్ని ఫ్రాంచైజీలు కూడా ముఖ్యమైన ఆటగాళ్ల కోసం కసరత్తులు చేస్తున్నాయి. ఈ వేలంలో చాలా మంది కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండడం సానుకూలాంశం అని చెప్పాలి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సన్ రైజర్స్ హైద్రాబాద్ ఒక ప్రణాలికను మనసులో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఒక క్వాలిటీ ఆల్ రౌండర్ ను దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారట.. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర బాగా రాణించడం వలనే అతనిని దక్కించుకోవడానికి చాలా జట్లు పోటీ పడే అవకాశం ఉందని స్పష్టంగా అర్ధమవుతోంది. అందుకే సన్ రైజర్స్ మాత్రం ఎన్ని కోట్లు అయినా సరే సాధ్యమైనంత వరకు రవీంద్ర ను దక్కించుకోవడానికి చూస్తున్నారు.

మరి సన్ రైజర్స్ అంచనాలు నిజమయ్యి రవీంద్ర వీరికే సొంతం అవుతాడా లేదా అన్నది తెలియాలంటే వేలం వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news