నయనతారను నిర్మాతలు భరించగలరా.. స్టాఫ్ కోసమే అంత ఖర్చా..?

-

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా ఈమె నటన పరంగా ,అందం పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. వయసు పెరుగుతున్నా కూడా నయనతారకు సినిమా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.. అన్ని భాషలలో కూడా నయనతార వరుస ఆఫర్లతో బిజీగా దూసుకుపోతోంది. వివాహం తర్వాత కూడా నయనతార అంతే జోష్లో సినిమాలలో నటిస్తూ దూసుకుపోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని అందరికంటే ఎక్కువగా ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది.

మే నెల వరకు ఈమె పారితోషకం రూ.5 కోట్ల వరకు ఉండేది. కానీ వివాహం తర్వాత ఈమె పారితోషకం ఇప్పుడు రూ.7 కోట్లకు పెరిగింది అంటే ఆమెకు ఏ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఎవరికైనా సరే వివాహం తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం ఆగిపోతాయి.. కానీ నయనతార అదృష్టం ఎలా ఉందంటే వివాహం తర్వాతనే ఈమె పారితోషకం పెంచింది అంటే ఇక ఆమెకు ఏ రేంజ్ లో ఆఫర్లు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక పారితోషికం విషయంలో రోజురోజుకు డిమాండ్ చేస్తున్న నయనతారను నిర్మాతలు భరించడం భారంగా అనిపిస్తుంది. అందుకే ఈమెకు ఇప్పుడు తక్కువగా అవకాశాలు ఇస్తున్నట్లు సమాచారం.ఇక అంతేకాదు నిర్మాతలు నయనతారను సినిమాలలో తీసుకుంటే ఆమెకు ఇచ్చే.. రూ.7కోట్ల పారితోషకం పక్కన పెడితే ఆమెతో పాటు వచ్చిన టీం కి ప్రతిరోజు లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేయాలట. ఈ విషయం తెలిసి నిర్మాతలు సైతం భయపడుతున్నారు.. ఎన్ని రోజులు షూటింగ్లో పాల్గొంటే ఆమె స్టాఫ్ కోసం నిర్మాతలు అన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.. అంతేకాదు షూటింగ్ ఇతర ప్రాంతాల్లో జరిగితే స్టాఫ్ కోసం ఫ్లైట్ టికెట్లు కూడా నిర్మాతలే బుక్ చేయాలి. ఇక వారి ఫుడ్ బిల్లు, హోటల్ రూమ్ బిల్లులు కూడా నిర్మాతలే ఇవ్వాలని సమాచారం.. ఇకపోతే ఒక సీనియర్ హీరోకి జోడిగా నయనతారను సంప్రదించగా ఈ రేంజ్ లో ఆమె డిమాండ్ చేసిందని వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version