కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం !

-

కొన్ని సార్లు మనకు తెలియకుండానే రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. మనము కరెక్ట్ గా వెళుతున్నా ఎదురుగా వచ్చేవాళ్ళు సరిగా రాకపోతే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కి పెద్ద ప్రమాదం తప్పింది. దీనితో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది. అసలు ఏమి జరిగిందంటూ ప్రజలు కంగారు పడుతున్నారు. జమ్మూకాశ్మీర్ లోని రాంబన్ హై వే లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన వాహనంలో ప్రయాణిస్తున్నారు.

అయితే అనుకోకుండా ఒక పెద్ద ట్రక్ వచ్చి రిజిజు వెళుతున్న కారును ఢీ కొట్టటడంతో ఈ ప్రమాదం జరిగిందట. అయితే అదృష్టవశాత్తూ మంత్రికి ఏమీ జరగలేదు. తాను ప్రయాణిస్తున్న కారు బులెట్ ప్రూఫ్ కావడం వలన ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పిందని అంతా అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news