అమీన్ పూర్ కారు ఘటన విషాదాంతం..కాలువలో కారుతో సహా మృతదేహం…!

-

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కారు కొట్టుకుపోయిన ఘటన విషాదాంతమైంది. ఐదురోజుల క్రితం కాజ్‌వే పైనుంచి మురుగు కాలువలోపడిన కారును రెస్క్యూ బృందం గుర్తించింది. కారుతో సహా కొట్టుకుపోయిన ఆనంద్‌ మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీసింది.

సంఘటన జరిగిన నాటి నుండి గత ఐదు రోజులుగా 24 గంటల పాటు NDRF బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.కారులో ఉన్న ఆనంద్ ఐదురోజుల తర్వాత శవమై తేలడంతో విషాదం నెలకొంది. ఆనంద్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news