కరోనా గుప్పిట్లో కర్ణాటక …!

-

కర్ణాటక రాష్ట్రాన్ని కరోన కమ్మేస్తుంది. తాజాగా గడచిన 24 గంటల్లో నమోదైన కేసు వివరాలను కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ ద్వారా మీడియాకు వెల్లడించారు. ఇక హెల్త్ బులిటెన్ ప్రకారం చూస్తే.. గడచిన 24 గంటల్లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 1498 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 26,815 కు చేరుకుంది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేడు కరోనా బారినపడి 15 మంది మరణించగా, నేటితో మృతుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 416 కు చేరుకుంది.

karnataka
karnataka

ప్రస్తుతం రాష్ట్రంలో 15,297 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. వీరిలో 279 మందికి ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు నేడు రాష్ట్ర వ్యాప్తంగా 571 మంది కరోనా నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11,098 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news