మలయాళ స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీ రాజ్లు లాక్డౌన్ సమయంలో రోడ్లపై కారు రేసింగ్ చేసినట్లు ఓ వీడియో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోలపై మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ విచారణకు ఆదేశించింది. అయితే ఇందులో దుల్కర్, పృథ్వీలు భాగస్వాములుగా ఉన్నారా లేదా అనేది ప్రస్తుతం విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. వాళ్ళు నిజంగానే ర్యాష్ డ్రైవింగ్ చేసారా లేదా అనేది కూడా విచారణ జరుగుతుందని తెలిపారు.
ఒకవేళ ఇందులో ఈ ఇద్దరు హీరోలు దోషులుగా తేలితే మాత్రం కచ్చితంగా మోటార్ వెహికల్ చట్టం 184 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామంటున్నారు. అలాగే ఈ వీడియోను చిత్రీకరించిన ఇద్దరు బైక్పై ఓవర్ స్పీడ్గా వెళ్లినట్లు అర్థమవుతోంది. వాళ్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.