నారా లోకేష్ పై మర్డర్ కేసు నమోదు…!

-

నిన్న టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటన పై టీడీపీ మరియు వైసీపీ నేతలు ఒకరిపై మరోకరు మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. ఇక నిన్న జరిగినే దారుణ ఘటన నేపథ్యం లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌ కు తెలుగు దేశం పార్టీ పిలుపు నిచ్చింది.

దీంతో ఇవాళ ఉదయం నుంచి టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు ఏపీ పోలీసులు. ఇక తాజాగా తెలుగు దేశం పార్టీ జాతీయ నాయకులు నారా లోకేష్‌ పై కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ కేసు నమోదు చేశారు.

ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఈ కేసు లో ఏ1 గా లోకేష్, ఏ2 గా అశోక్ బాబు, ఏ3 గా ఆలపాటి రాజా, ఏ4 గా తెనాలి శ్రావణ్ పేర్లను చేర్చారు పోలీసులు. అంతేకాదు… .హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కూడా నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news