ఏపీలో టపాకాయలు కాల్చినందుకు ఇద్దరి మీద కేసు

-

ఆంధ్రప్రదేశ్లో టపాసులు పేల్చిన ఇద్దరి మీద కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు టపాసులు కాల్చి అందుకు అనుమతి ఉంటుంది అది కూడా ఈ ఒక్క రోజే కాల్చాల్సి ఉంటుంది. అయితే నిబంధనలు ఉల్లంఘించి నిన్న రాత్రి టపాసులు కాల్చిన కొందరి మీద కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో లో ని వందనాలు ఉల్లంఘించారని వన్టౌన్ పోలీసులు ఇద్దరు వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు.

ఇక జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగంకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news