వికారాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన పశువుల దొంగలు

-

కాదేది దొంగతనానికి అనర్హం అంటూ దొంగలు కొత్త భాష్యం చెబుతున్నారు. ఏది కనిపిస్తే అది ఎత్తుకెళ్లి పోతున్నారు. డబ్బు, బంగారాన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా దాచుకుంటున్న క్రమంలో.. కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లిలో పశువుల దొంగలు రెచ్చిపోయారు. రాత్రి పొలం వద్ద కట్టేసిన పశువులను చోరీ చేశారు దొంగలు.

కావలి దశరథ్ కు చెందిన రెండు ఆవులు, రెండు ఎద్దులు చోరీ చేశారు దొంగలు. స్థానికంగా ఉన్న ఓ సిసి కెమారా లో రికార్డయిన ఓ బొలేరో వాహనం కదలికలను బట్టి పోలీసులు విచారణ చేపడుతున్నారు. శనివారం సాయంత్రం ఘటనా స్థలంలో అనుమాస్పదంగా తిరిగిన ముగ్గురు వ్యక్తులపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు స్థానిక రైతులు. పరిగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసాడు బాధిత రైతు.

Read more RELATED
Recommended to you

Latest news