నేడు ‘బోంబే’ కి బాబు

-

 

బీఎస్ఈలో జరిగే అమరావతి బాండ్ల లిస్టింగ్ కోసం హాజరు

అమరావతి బాండ్ల లిస్టంగ్ కార్యక్రమం బోంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) లో సోమవారం భారీ ఎత్తున జరగనున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మీదుగా ఆదివారం ముంబై వెళ్లనున్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా కొద్ది రోజుల క్రితం రూ. 1300 కోట్ల విలువైన అమరావతి బాండ్లను జారీ చేయడంతో పాటు..అవి ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయిన సంగతి తెలిసిందే.. దీంతో ఈ నెల 27న బీఎస్ఈలో జరిగే బాండ్ల లిస్టింగ్ను పెద్ద ఎత్తున చేపట్టి పెట్టుబడులను ఆకర్షించాలని సీఆర్డీఏ సంకల్పించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 8.30 గంటలకు చంద్రబాబు బీఎస్ఈ కి చేరుకుని దేశ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో  కోలాహాలంగా నిర్వహించే లిస్టింగ్ లో పాల్గొంటారు. ముంబై టూర్లో భాగంగా రతన్ టాటా తోపాటు దేశంలోని ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news