సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్ …!

-

సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్. విద్యార్థుల పాఠాల ప్రణాళిక భారాన్ని విద్యార్థులపై తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ఇందుకుగాను 9 నుండి 12 తరగతుల మధ్య ఉండే సిలబస్ లో కొన్ని పాఠ్యాంశాలను తగ్గించడానికి సీబీఎస్సీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏకంగా 30 శాతం సిలబస్ తగ్గించే విధంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ తెలియజేశారు. ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ నడుమ విద్యార్థులు పాఠశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు. నిజానికి ఈ విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందనే అంశంపై కూడా స్పష్టత లేదు.

cbse
cbse

మన దేశ వ్యాప్తంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులవల్ల పాఠ్య ప్రణాళికలను సవరించే విధంగా సీబీఎస్సీ ప్రయత్నం చేసింది. ఇందులో 9 నుంచి 12 తరగతుల మధ్య ఉండే సిలబస్ ను తగ్గించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొంతమంది విద్యా రంగ నిపుణుల సలహాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకు గాను ఏకంగా 15 వందల మంది సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news