ఓమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం… ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కొత్త క్వారంటైన్ రూల్స్

-

దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 3000కు పైబడి కేసులు నమోదయ్యాయి. ఇందులో మెజారిటీ కేసులు ఇతర దేశాల నుంచి భారత్ కు రావడంతోనే వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కొత్త క్వారంటైన్ రూల్స్ విధించింది. ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు.. ఇక్కడకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా 7 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే అని ఆదేశించింది కేంద్రం. ఏడు రోజుల అనంతరం 8వ రోజు తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది.టెస్ట్ రిజల్ట్ ను ఎయిర్ సువిధ యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. పరీక్ష నెగిటివ్ వస్తే మరో 7 రోజులు పాటు ఆరోగ్యాన్ని సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవాలని.. ఒకవేళ టెస్ట్ పాజిటివ్ వస్తే సదరు ప్రయాణికుడి శాంపిల్ ను జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం పంపాలని.. వెంటనే సదరు ప్రయాణికుడు ఐసోలేషన్ కి వెళ్లాలని కేంద్రం గైడ్ లైన్స్ రూపొందించారు. కొత్తగా తీసుకువచ్చిన నియమ నిబంధనలు జనవరి 11 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news