రంగంలోకి కేంద్రం.. మిషన్ భగీరథపై దర్యాప్తు..

-

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ‌లో ఇంటింటికీ తాగు నీటి కోసం అమ‌లు చేసిన మిష‌న్ భ‌గీర‌థ‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఈ ద‌ర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేకాధికారిని కేంద్రం నియ‌మించింది. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇంటింటికీ తాగు నీటి స‌ర‌ఫ‌రా కోసం మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున నిధులు వ్య‌యం చేసింది. అయితే ఇటీవ‌లే ఈ ప‌థ‌కం అమ‌లు తీరుపై స‌ర్వే నిర్వ‌హించింది జ‌ల జీవ‌న్ క‌మిష‌న్. ఈ క‌మిష‌న్ స‌ర్వే రిపోర్టు ఇటీవ‌లే కేంద్రానికి అంద‌డంతో.. కేంద్ర జ‌ల వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు ఆ నివేదిక ఆధారంగా ప‌థ‌కంపై ఓ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని ప‌థ‌కంపై దర్యాప్తున‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news