రేపు ఏపీకి కేంద్ర బృందాలు.. రెండు రోజులు అక్కడే !

-

రేపట్నుంచి రెండు రోజుల పాటు ఏపీ రాష్ట్రంలో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కోసం రాష్ట్రానికి మూడు కేంద్ర బృందాలు బయలు దేరాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంత జిల్లాల్లో పర్యటించనున్నాయి ఈ కేంద్ర బృందాలు. రేపు కృష్ణా, గుంటూరు, అనంత జిల్లాల్లో ఈ మూడు బృందాల పర్యటన సాగానుండగా ఎల్లుండి ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు బృందాల పర్యటన జరగానుంది.

ఇటీవల భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ కేంద్ర బృందం పర్యటించి పంట నష్టం అంచనా వేయనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం ఏపీకి వస్తోంది. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఈ బృందం అంచనా వేయనుంది. దాదాపుగా 15 వేల కోట్ల వరద నష్టం వచ్చినట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే కేంద్ర బృందాలు వేసిన అంచనా ప్రకారమే కేంద్ర ప్రభుత్వం పంట నష్టం విడుదల చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news