సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం.. గ్రామ కంఠ ఆస్తులకు సర్టిఫికెట్లు

-

 

అమరావతి: గ్రామ కంఠ భూములపై ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రామ కంఠాల్లో ఖాళీగా ఉన్న ఇల్లు, స్థలాలకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష’ పథకంలో భాగంగా వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి గ్రామ కంఠ ఆస్తులకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. మొత్తం 25 వేల గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే 753 గ్రామాల్లో సర్వేను పూర్తి చేశారు. 241 గ్రామాల్లో ఈ స్థలాలను గుర్తించి మార్క్ చేశారు. అంతేకాదు వీటికి ప్రత్యేకమైన నెంబర్లు కేటాయించారు.

ఇక పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో మంత్రులు 100 గ్రామ కంఠాల్లో 20 వేల నుంచి 25 వేల ఆస్తులకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. మరో 16 గ్రామాల్లో 3,170 ఆస్తుల వివరాలను సిద్ధం చేశారు. గ్రామ స్థాయి సిబ్బంది.. వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆస్తిని పరిశీలించి నిర్ధారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా ఆస్తులను గుర్తించారు. కృష్ణా జిల్లా బూతుమిల్లిపాడులో గ్రామ కంఠం ఆస్తులను పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news