చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నాడు – మంత్రి సురేష్

-

అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీ వైసీపీ మాత్రమేనని అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. సమాజంలో దళితులకు సమాన హక్కులు, సాధికారత ఇచ్చే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు మంత్రి సురేష్.

minister suresh
minister suresh

సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా దళితులకు తోడ్పాటు అందిస్తున్న నాయకుడు జగన్ అన్నారు. దళితులు జాతి సంపద.. అన్ని పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయన్నారు. చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు మంత్రి సురేష్. చంద్రబాబు కడుపు నిండా కత్తులు పెట్టుకుని దళితులను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news