తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తా: చంద్రబాబు

-

తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తాన‌ని… చంద్రబాబు అన్నారు. దర్శి నగర పంచాయితీ ఎన్నికల ఫలితాలపై ప్రకాశం జిల్లా నాయకులతో సమీక్ష నిర్వ‌హించారు చంద్రబాబు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ…. ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా సరైన నాయకత్వం ఉన్న చోట టీడీపీకి మంచి ఫలితాలొచ్చాయని తెలిపారు. ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత, జిల్లా నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో దర్శిలో విజయం సాధించారని గుర్తు చేశారు.

chandrababu

వైసీపీ నేతలు రెండున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను మానసికంగా, శారీరకంగా వేధించారని ఫైర్ అయ్యారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని ‎ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు చంద్ర‌బాబు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్ర అభివృద్దిపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశామ‌ని ఆగ్ర‌హించారు. ఇప్పుడు పార్టీని పునాదుల నుంచి సరైన నాయకత్వంతో బలోపేతం చేస్తున్నామ‌ని… 30 ఏళ్ల వరకు స్తిరంగా ఉంటే నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.
పార్టీలో కష్టపడి నిజాయితీగా పని చేసిన వారికే ప్రాధాన్యమ‌ని ఇస్తామ‌న్నారు. పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క కార్యకర్తకు, నాయకునికి అన్యాయం జరగనివ్వమ‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు.

Read more RELATED
Recommended to you

Latest news