లోన్ యాప్స్ వేధింపులతో బలవన్మరణాలు.. చంద్రబాబు ఆవేదన

-

లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో లోన్ యాప్స్ వేధింపులకు గురవుతున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. వేధింపులు తాళలేక, పరువు పోతుందన్న భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్ యాప్స్ వేధింపులు, వాటి వల్ల ఏపీలో జరుగుతున్న ఆత్మహత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

నిన్న రాజమహేంద్రవరంలో దంపతుల ఆత్మహత్య ఘటన మరువకముందే ఇవాళ పల్నాడులో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా మహిళల గౌరవాన్ని కించపరిచేలా వేధిస్తోన్న ఇలాంటి లోన్ యాప్‌లు, వాటి నిర్వాహకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతే కానీ చావు పరిష్కారం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్‌లపై ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని..  బాధితులకు అండగా ఉంటూ మనోధైర్యాన్ని ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news