వైసీపీకి ఓటేస్తే, మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లే – చంద్రబాబు

-

వైసీపీకి ఓటేస్తే, మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లేనని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యం ఓటు తెలుగుదేశానికి రెండో ప్రాధాన్యం ఓటు పీడీఎఫ్ కు వేయండని కోరారు. వైసీపీకు ఎవ్వరూ ఎలాంటి ఓటు వేయొద్దని… ఉపాధ్యాయ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీలో లేకపోయినా మొదటి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం ఓట్లను ఏపీటీఎఫ్, పీడీఎఫ్ అభ్యర్థులకు వేయండన్నారు చంద్రబాబు.

వివేకానందరెడ్డి కేసుపై కీలక విచారణ జరుగుతుంటే స్కిల్ డెవలెప్మెంట్ పై తప్పుడు కేసులతో అసలు విషయాన్ని మళ్లించే యత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. సమాజంలో చీడపురుగులకు గుణపాఠం చెప్పకపోతే వివేకానంద రెడ్డిని చంపినట్లుగా ఇంకా రెచ్చిపోతారు… వివేకానందరెడ్డిని చంపి ఎన్ని విన్యాసాలు చేస్తున్నారో అంతా చూస్తున్నామన్నారు.

చంపి ఊరందరి మీద వేసి, తప్పించుకోవటానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారని… వైసీపీ లాంటి ప్రభుత్వం వస్తుందని ఊహించి ఉంటే నేను కూడా లా చేసేవాడినని వెల్లడించారు. నన్ను నేను డిఫెండ్ చేసుకోవటానికైనా న్యాయవాదినయ్యేవాడిని… కానీ ఎంఏ ఎకనామిక్స్ చేయటం వల్ల సంపద సృష్టి, అభివృద్ధిపై నా ఆలోచనలు వెళ్లాయని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 30 శాతం దొంగ ఓట్లు చేర్చిందని నిప్పులు చెరిగారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news