ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూ సూద్.. ఫోన్ చేసిన చంద్రబాబు..!

-

చిత్తూరు జిల్లా రైతుకు చేయూతనిచ్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు ప్రముఖ బాలీవుడ్ సోనూ సూద్. కేవీపల్లి మండలం మహల్ రాజపురం రైతు నాగేశ్వరరావు తన కూతుళ్లతోనే వ్యవసాయం చేస్తున్నాడు. పొలం దున్నడానికి ఎద్దులు కూడా లేకపోవడంతో కూతుళ్లనే ఎద్దులుగా వాడేస్తున్న వీడియో చూసి చలించిపోయాడు సోనూ సూద్. అయితే దీనిపై వెంటనే స్పందించిన సోనూ సూద్.. తొలుత వారికి ఓ జత ఎద్దులు కొనివ్వాలని  నిర్ణయించుకున్నారు.

కానీ, ఆ తర్వాత తన మనసు మార్చుకుని వారికి ఓ ట్రాక్టర్ కొనివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సాయంత్రానికల్లా ఓ ట్రాక్టర్ మీ పొలాన్ని దున్నుతూ ఉంటుంది అంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు. అన్నట్లుగానే వాళ్ల ఇంటికి ట్రాక్టర్ పంపించాడు సోనూ సూద్. ఆ ఏరియాలోని సోనాలిక ట్రాక్టర్ ఏజెన్సీతో మాట్లాడి రైతు ఇంటికే నేరుగా ట్రాక్టర్ పంపించాడు సోనూ.

కాగా, దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సోనూ సూద్‌కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనూ సూద్‌తో తాను ఫోన్ ద్వారా మాట్లాడినట్టు చంద్రబాబు వెల్లడించారు. ఆ రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యత తాను తీసుకుంటున్నానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ట్వీట్‌కు సోనూ సూద్ స్పందించారు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news