కొన్ని గంటలుగా నేల మీదనే బాబు.. భోజనం కూడా చేయకుండా ?

-

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఆర్డీవో కనక నరసారెడ్డి    విమానాశ్రయంలో ఆందోళన కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడుతో చర్చిస్తున్నారు. అయితే కొద్ది గంటల నుండి బాబు కింద కూర్చుని నిరసన తెలియచేస్తున్నారు. ఆయన భోజనం కూడా తినలేదని అంటున్నారు. ఇక ఈ అంశం మీద అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎస్.ఈ.సీ సమర్థంగా వ్యవహరించడం లేదుని ప్రతిపక్షంగా మేము చేసే ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవడం లేదని అన్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోస్ట్ మాన్ ఉద్యోగం చేస్తున్నారని రాష్ట్రంలో తొలి సారి అభ్యర్ధులతో క్యాంప్ లు నిర్వహించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని హత్య చేసిందని అన్నారు. చంద్రబాబు అక్రమ నిర్బంధాన్ని ఎన్నికల కమిషన్ సుమోటో గా తీసుకోవాలని, సొంత జిల్లాకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రిని ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్నారని స్నన్స్టు. విశాఖలో ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news