ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు

-

కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆర్టీసీ బస్సు ఎక్కారు. మహిళల పక్కనే కూర్చొని వారితో కాసేపు మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చంద్రబాబు నాయుడు ప్రయాణం చేశారు. ఛార్జీ చెల్లించి కండక్టర్ నుంచి టికెట్ తీసుకున్నారు. ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించి మహిళలతో మాట్లాడారు.

బస్సులో ఆయన మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు టీడీపీ మహాశక్తి పథకం గురించి వారికి వివరించారు. తాము అధికారం లోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఒక్కసారిగా ఆయన బస్సులోకి రావడంతో ప్రయాణీకులు అందరూ ఆశ్చర్యపోయారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news