సీఎం హోదాలో రేపు తొలిసారి ఢిల్లీకి వెళ్ళనున్న చంద్రబాబు

-

సీఎం చంద్రబాబు నాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్తుండడంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.రేపు సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు.

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీయే నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చిస్తారని వార్తలు. గత ఐదు సంవత్సరాలలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు.కాగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టడంపై చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. గత ప్రభుత్వ పాలన వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర పురోగతి కోసం చర్యలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news