ఏపీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ

-

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయి వందలాది మంది ఆంధ్రప్రదేశ్ పౌరులు కంబోడియాలో చిక్కుకున్నారని, కంబోడియాలో ఇరుక్కుపోయిన బాధితులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు.

యువతను రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సహయక చర్యలు స్పీడప్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట మోసపోయిన తెలుగు యువతతో కాంబోడియాలో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తులో వెలుగు చూసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news