పాపం ఛార్మి కష్టాలు మామూలు గా లేవట..!!

-

విజయ్‌ దేవరకొండ హీరోగా.. మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్‌, పూరీ జగన్నాథ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు , మంచి హిట్ కొట్టి పాన్ ఇండియా డైరెక్టర్ కావాలను కున్న పూరీ జగన్నాథ్ కు దెబ్బపడింది.

ఇక ఈ సినిమా నిర్మాత గా వ్యహరించిన ఛార్మి కౌర్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. వీరు ఏదో అనుకొని తీస్తే అది మరోలా రిజల్ట్ ఇచ్చింది. ఇక తర్వాత జరిగిన డిస్టి బ్యూటర్స్  రచ్చ , పూరీ జగన్నాథ్ ఒపెన్ లెటర్ రాయడం మరో ఎపిసోడ్. ఇక ఈ సినిమా గురించి ఈడి అధికారులు పూరీ జగన్నాథ్ ను ,ఛార్మి ని, విజయ్ ను పిలిచి విచారించడం సంచలనం కలిగించింది.

వీరిలో కొద్దిగా విజయ్ మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. తన చేతిలో ప్రస్తుతం ఒక తెలుగు సినిమా షూటింగ్ దశలో ఉన్నది. ఇంకో బాలీవుడ్ ప్రాజెక్ట్ చర్చల దశలో వుంది. ఇక పూరీ జగన్నాథ్ కు కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎటు చూసినా ఛార్మి కు మాత్రమే దెబ్బ పడింది. ఇప్పటికే సినిమా ప్లాప్ తో మొత్తం నష్ట పోయిన ఛార్మి ఈ కేసులతో జైలుకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా పెట్టుబడులు నిభందనలకు విరుద్ధంగా ఉన్నాయని లీకులు అందుతున్నాయి. ఇక సినిమా తీద్దామని అంటే చేతిలో డబ్బులు లేవు, ఇటు పూరీ కూడా తనకి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news