నిమ్స్ ఆస్పత్రిలో ఘరానా మోసం..

-

నిమ్స్ ఆస్పత్రిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.. వైద్యం కోసం వచ్చిన రోగితో ప్రైవేట్ హాస్పిటల్ లో ఫీజు కట్టించిన వైనం బయట పడింది..బయట నుంచి వచ్చే డాక్టర్ సర్జరీ చేస్తారు అంటూ నిమ్స్ న్యూరో సర్జన్ 45 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలో కొందరు డాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

ఎన్ని పిర్యాదులు వచ్చినా పాలనా యంత్రాంగం పట్టించుకోవడం లేదని అంటున్నారు. డైరెక్టర్ మనోహర్ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సర్జరీ జరగకున్నా కుట్లు ఇప్పించుకొవాలని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు డేట్ ఇవ్వడంతో మోసపోయిన విషయం తెలుసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news