వివాహేతర సంబంధమే ఆ మహిళ ప్రాణాలు తీసిందా!

-

గతేడాది నవంబర్ లో చోటుచేసుకున్న ‘దిశ’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే ‘దిశ’ వంటి మరో ఘటన చేవెళ్ల తంగేడుపల్లి లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతి చెందిన మహిళ మర్డర్ కేసులో అసలు ఆ మహిళ ఎవరు? ఏంటి? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే తాజాగా ఆ మహిళ మర్డర్ కు సంబంధించి అధికారులు స్వల్ప పురోగతి సాధించినట్లు తెలుస్తుంది. మర్డర్‌కు గురైన ఆ మహిళ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆమె గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్ మార్టం ప్రిలిమినరీ నివేదికతో ముందుగా మహిళ మెడకు తాడుతో ఉరేసి అనంతరం తలపై బలంగా మోది హత్య చేసినట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా చనిపోయిన మహిళకు స్మోకింగ్ చేసే అలవాటు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ మహిళ తెల్లవారు జామున 2-3 గంటల మధ్యలో మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. .మృతురాలు వివాహిత అని,చేతులతో గొంతు నులుమినట్లు ఆనవాలు, మహిళ మెడతో పాటు రెండు చేతులు కట్టేసినట్లు ఆనవాలను గుర్తించారు. మహిళకు సంబంధించిన రక్త నమూనాలు, విశ్రా శాంపుల్స్‌ని ఉస్మానియా ఫోరెన్సిక్‌కి పంపించారు పోలీసులు.

కేసు చిక్కుముడి వీదెంటవరకు మహిళ మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలోనే భద్రపరచనున్నారని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం, ఆర్థిక గొడవలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా ఈ హత్య ఉదంతంలో ముగ్గురి హస్తం ఉండి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దారుణానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news