రేపు ఈడీకి జవాబు చెబుతా : చికోటి ప్రవీణ్

-

క్యాసినో వ్యవహారంపై నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ స్పందించారు. ఈడీ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని.. సోమవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు తెలిపారు.

‘‘ “గోవా, నేపాల్‌లో క్యాసినో లీగల్‌. నేను లీగల్‌ వ్యాపారమే చేశాను. నేను సామాన్యమైన వ్యక్తిని. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ రైడ్‌ చేసింది. ఈ విషయంలో ఈడీ అధికారులకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అందుకే వాళ్లు వివరణ అడిగారు”’ అని చీకోటి ప్రవీణ్‌ పేర్కొన్నారు.

ఇప్పటికే నేపాల్‌ క్యాసినోకు 10 మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైనట్లు ఈడీ గుర్తించింది. క్యాసినోకు రావాలంటూ పలువురు హీరోయిన్లు చేసిన ప్రమోషన్‌ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రమోషన్లకు సంబంధించి క్యాసినో నిర్వాహకుల నుంచి సినీ తారలకు అందిన పేమెంట్‌.. ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news