చైనా కరోనా వాక్సిన్ విడుదల.. పని తనం చూడాలి మరి..!

-

చైనా కరోనా వ్యాక్సిన్​ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు నిర్వహించిన మూడో దశ ట్రయల్స్​లో వ్యాక్సిన్​ సురక్షితమని తేలింది. దీనిని తక్షణమే ఉపయోగించేందుకు ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్​ను జులై 22 నుంచే వినియోగించేందుకు అనుమతి లభించిందని గ్లోబల్​ టైమ్స్ పేర్కొంది. కరోనా వైరస్​ను అరికట్టేందుకు మొదటగా ఈ వ్యాక్సిన్​ను ఫుడ్​ మార్కెట్, ట్రాఫిక్​ వ్యవస్థ, సేవారంగాలలో పనిచేసే వారికి ఇవ్వనున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వైద్యశాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కేంద్రం డైరెక్టర్​ ఝెంగ్​ జోంగ్​ వీ శనివారం ప్రకటించారు.

వ్యాక్సిన్ ధర.. గతంలో చైనా ప్రభుత్వ ఔషధ సంస్థ సినోఫార్మా​ ప్రకటించిన దానికంటే తక్కువగానే ఉంటుందని జోంగ్ వీ తెలిపారు. మూడో దశ ట్రయల్స్​లో భాగంగా వ్యాక్సిన్​ను యూఏఈలోని 20వేల మందిపై ప్రయోగించినట్లు సినోఫార్మా​ ఛైర్మన్​ యాంగ్ షియోమింగ్ వెల్లడించారు. ప్రభుత్వం అనుమతించడానికి ముందే ఈ సంస్థ తమ సిబ్బందిపై జులైలో వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిర్వహించినట్లు తెలుస్తోంది.చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ కూడా మరో వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను తయారు చేస్తోంది. ఇండోనేసియాలో 1600 మంది వలంటీర్లపై ఈ నెలలోనే ట్రయల్స్​ను ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Latest news