చంద్రబాబును జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలని జగన్ ప్లాన్‌ : చినరాజప్ప

-

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తమ పార్టీ అధినేత చంద్రబాబును జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. అందుకే ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు. అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో ఓ గుమాస్తా అని, అన్ని శాఖలకు ఆయనే ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, అప్పటి నుంచి అన్నీ తప్పుడు కథనాలు అల్లుతున్నారన్నారు.

Disqualify MLA Chinna Rajappa...Petition Filed!

గురువారం మీడియాతో మాట్లాడుతూ… అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు కానీ ప్రారంభోత్సవం చేస్తున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు తనను పిలవడం లేదని… ఖచ్చితంగా ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనే అని అన్నారు. జనాలను తీసుకురావాలని ఉద్యోగస్తులకు టార్గెట్లు ఇస్తున్నారన్నారు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వసుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ నుంచీ అన్నీ తప్పుడు కథనాలు చెబుతున్నారని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఎక్కడికి వచ్చినా చెట్లు కొట్టేడయం, పరదాలు కప్పడం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడం సాధారణంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news