Chiranjeevi : తెలంగాణ డిప్యూటీ సీఎంని కలుసుకున్న చిరంజీవి దంపతులు..

-

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకొని శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని కలుసుకున్నారు. చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి మర్యాదపూర్వకంగా భట్టి విక్రమార్కని గురువారం రాత్రి ప్రజాభవన్ లో కలుసుకున్నారు.

 

చిరంజీవి దంపతులకు భట్టి విక్రమార్క పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఇక కాశ్మీర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శాలువాతో చిరంజీవి భట్టి విక్రమార్కని సత్కరించారు. భట్టి విక్రమార్క కూడా తిరిగి చిరంజీవిని శాలువాతో సత్కరించారు. అలాగే భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క, ఆయన కొడుకు సూర్య విక్రమాదిత్య చిరంజీవి దంపతులకు ఆత్మీయ ఆతిథ్యం పలికారు.

డిప్యూటీ సీఎం పదవి చేపట్టినందుకు భట్టి విక్రమార్కకి చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేస్తూనే.. సిని ఇండస్ట్రీ కి సంబంధించిన విషయాలు కూడా చర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news