చిరంజీవి భోళా శంకర్ విడుదల ఆలస్యంగా చేస్తారా..!!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యి సంచలన వసూళ్ళు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.ఈ సినిమా తో  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయి.

ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. తాజాగా 200 కోట్ల రూపాయల వసూళ్లు  పైగాసాధించి రికార్డ్ సృష్టించింది. ఇక చిరంజీవి రాజకీయాలు వదిలి మంచి పని చేశాడంటూ చిరు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దీనితో చిరంజీవి కూడా తాను చేయాలనుకున్న డైరెక్టర్స్ జాబితా తీసి వరసగా లైన్ లో పెట్టుకుంటున్నారు. అలాగే సాధ్యమైనంత వరకు యంగ్ డైరక్టర్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వారైతే తనను కొత్తగా చూపిస్తారని భావిస్తున్నారు.

ఇక ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ ఉన్న చిరు మొదట ఈ సినిమా ను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలనే ప్లాన్ చేశారు. కాని ఇప్పుడు వాల్తేరు వీరయ్య లా ఎంటర్టైనింగ్ గా ఉండాలని మరింత కసరత్తు చేయాలని చూస్తున్నారట. అందువల్ల ఈ సినిమా మరో రెండు నెలలు వెనక్కి అంటే జూన్ నెలలో రిలీజ్ చేయాలని ప్రాథమికంగా నిర్ధారించారట. వాల్తేరు వీరయ్య  సినిమా విజయం సాధించడంతో భోళా శంకర్ పై అంచనాలు పెరిగిపోయాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news