పూరి కథ చిరంజీవి కోసమా…?

-

టాలీవుడ్ లో ఒకప్పుడు పూరి జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతనితో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు ఒకప్పుడు ఎదురు చూసే వాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు గాని అతనికి క్రేజ్ బాగా తగ్గిపోయింది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దానికి కారణం అతను చేసే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడమే. ఒకప్పుడు పూరి సినిమాల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు చూడటం లేదు.

ఇప్పుడు పూరి కరోనా దెబ్బకు ఇంట్లోనే ఉంటున్నాడు. అతను సినిమా చేయడానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుత౦ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మరో సినిమా ఎవరి తో చెయ్యాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంట్లో ఖాళీ గా ఉన్న పూరి ఒక కథను రెడీ చేస్తున్నాడు. ఆ కథను ఎవరి కోసం రాస్తున్నాడు అనేది అర్ధం కావడం లేదు.

పైసా వసూల్ సమయంలోనే అతను మరో సినిమా బాలకృష్ణ తో చెయ్యాలని చూసాడు. కాని అప్పుడు ఆ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఆయన కోసం కథ రాస్తున్నాడు అంటున్నారు. ఆ కథను చిరంజీవి కోసం కూడా రాసే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవి తో ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. ఆ సినిమా కోసమే ఈ కథ రాస్తున్నాడు అనేది టాక్. పవన్ కళ్యాణ్ కోసం కూడా అతను కథ రెడీ చేస్తున్నాడని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news