నా పర్యాటక శాఖను కిషన్‌ రెడ్డి..గుంజుకున్నాడు : చిరంజీవి

-

నా పర్యాటక శాఖను కిషన్‌ రెడ్డి..గుంజుకున్నాడంటూ మెగాస్టార్‌ చిరంజీవి సరదాగా అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ – 2022 నిన్న జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… నేను ఇక్కడికి రావడానికి కారణం నా మిత్రుడు… అసెంబ్లీలో పక్క పక్కన కూర్చున్నామన్నారు.

మన దేశంలో అనేక సంస్కృతులు ఉన్న, భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటామని.. ప్రపంచంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశం మన భారత దేశమని చెప్పారు. కరోనాతో గత సంవత్సరం చేయలేకపోయారు… సొంత గడ్డపై కిషన్ రెడ్డి ఘనంగా మహోత్సవం నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.

మన దగ్గర ఎందరో కళాకారులు ఉన్నారు… దేశవ్యాప్తంగా ఉన్న సినిమాలో కూడా దీంట్లో ఓ భాగమే అని చెప్పారు. ఇప్పుడు తెలుగు సినిమా హిందీ సినిమా లేదు అన్ని ఇండియన్ సినిమాలేనని.. ఈ మాట స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సాక్ష్యంగా మోడీ గారే ఈ మాట చెప్పారని గుర్తు చేశారు. ఆ మాటలు విన్న నేను ఓ తెలుగువాడిగా, కళాకారుడిగా చాలా గర్వపడ్డానని. రాజమోళి గారు సినిమాకు ఎల్లలు లేకుండా చేసారని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news