నారా లోకేష్ కి సీఐడీ నోటీసులు..!

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కొందరు అధికారుల పేర్లు రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటామని, అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని, లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఐడీ సీరియస్ అయింది. అధికారులను రెడ్ బుక్ పేరుతో నారా లోకేశ్ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆయనపై చర్యలకు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం నారా లోకేశ్ కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. దీంతో సీఐడీ అధికారులు తాజాగా నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేశారు. ఆయన ఫోన్ వాట్సాప్ కు నోటీసులు పంపారు. దీంతో ఈ నోటీసులపై స్పందించిన నారా లోకేశ్ సీఐడీ అధికారులకు సమాధానం పంపారు. అయితే నారా లోకేశ్ సమాధానం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news