బ్రేకింగ్ : నటుడు విజయ్‌చందర్ కు జ‌గ‌న్ స‌ర్కార్‌ కీలక పదవి..

-

కరుణామయుడు చిత్రంలో క్రీస్తుగా, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యంలో సాయిబాబాగా నటించి తెలుగు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు, వైసీపీ నేత తెలిదేవర విజయ్ చందర్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్(fdc) ఛైర్మెన్ గా, సినీ నటుడు విజయ్‌చందర్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

కాగా విజయ్‌చందర్ తొమ్మిదేళ్లుగా వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. విజ‌య్‌చంద‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో సుప‌రిచితుడు. ఆయ‌న సినిమాల్లో.. సాయిబాబాగా, క‌రుణామ‌యుడులో ఏసుప్ర‌భుగా న‌టించాడు. ఇక జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు, ష‌ర్మిల పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఆయ‌న వైసీపీకి ఎంతో స‌పోర్ట్‌గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news