సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె నాయుడుకు సుప్రీంకోర్టులో ఊర‌ట

-

టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కే.నాయుడు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. న‌టి భీమిరెడ్డి శ్రీ‌సుధ‌తో గ‌తంలో అత‌డు స‌హ‌జీవ‌నం చేయ‌గా.. ఆ వ్య‌వ‌హారం వివాద‌స్ప‌ద‌మైంది. త‌న‌తో శ్యామ్ కే నాయుడు పెళ్లి పేరుతో ఐదేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేశాడ‌ని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడ‌ని శ్రీ‌సుధ హైద‌రాబాద్ ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసారు. ఈ వ్య‌వ‌హారంపై తెలంగాణ హై కోర్టుకు చేర‌గా.. శ్యామ్‌కే నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది.

తెలంగాణ హై కోర్టు తీర్పును శ్రీ‌సుధ సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. శ్యామ్ కే.నాయుడు మూలంగా త‌న‌కు ప్రాణ‌హానీ ఉంద‌ని, అత‌ని బెయిల్ ర‌ద్దు చేయాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు శ్రీ‌సుధ పిటిష‌న్‌ను కొట్టేసింది. శ్రీ‌సుధ కేసులో తాను ఒప్పందం ప్ర‌కారం స‌హ‌జీవ‌నం చేశాన‌ని, అందుకు రూ.50ల‌క్ష‌లు డీడీ రూపంలో చెల్లించాను అని ప‌త్రాల‌ను శ్యామ్ కే.నాయుడు కోర్టుకు స‌మ‌ర్పించాడు. దీంతో అత‌నికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news